ఓటు హక్కు వినియోగించుకున్న కమిషనర్ ఆదర్శ్ సురభి

ఓటు హక్కు వినియోగించుకున్న  కమిషనర్ ఆదర్శ్ సురభి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 03: ఎన్నికల విధులు నిర్వహించే ప్రతిఒక్క సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తన ఓటును ఉపయోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో విలువైనదని, ఓటుహక్కును అర్హులైన వారందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ లో ఆయన ఫోటో తీసుకొని కలెక్, ఖమ్మం కు ట్యాగ్ చేశారు. ఎన్నికల పండుగను పురస్కరించుకుని సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటుచేసినట్లు, ఇట్టి సెల్ఫీ పాయింట్ లో ఫోటో దిగి, @collector_kmm కు ట్యాగ్ చేయాలని, ఇట్టి పోటీలో రూ. 20 వేల నగదు బహుమతిని పొందవచ్చని ఆయన తెలిపారు.

Tags:
Views: 2

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి