ఓటు హక్కు వినియోగించుకున్న కమిషనర్ ఆదర్శ్ సురభి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 03: ఎన్నికల విధులు నిర్వహించే ప్రతిఒక్క సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తన ఓటును ఉపయోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో విలువైనదని, ఓటుహక్కును అర్హులైన వారందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ లో ఆయన ఫోటో తీసుకొని కలెక్, ఖమ్మం కు ట్యాగ్ చేశారు. ఎన్నికల పండుగను పురస్కరించుకుని సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటుచేసినట్లు, ఇట్టి సెల్ఫీ పాయింట్ లో ఫోటో దిగి, @collector_kmm కు ట్యాగ్ చేయాలని, ఇట్టి పోటీలో రూ. 20 వేల నగదు బహుమతిని పొందవచ్చని ఆయన తెలిపారు.
Comment List