జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

ఐ ఎన్ బి టైమ్స్ పాలేరు మే 07 : పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాయకన్ గూడెం చెక్ పోస్ట్, తిరుమలాయపాలెం  మండలం, సుబ్లేడ్ క్రాస్ రోడ్ లో గల జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి తనిఖీ చేశారు. ఈనెల 13 వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణ జరుగకుండా పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు ఇరువైపులా వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. తనిఖీల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు పాటిస్తూ... ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొవాలని అన్నారు.ప్రధానంగా తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొవాలన్నారు. ప్రజలు ఎవరైనా నగదును వెంటబెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. ఆధారాలు లేనట్లయితే నగదు జప్తు చేస్తారని  అన్నారు.

Tags:
Views: 16

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి