రేపు ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ రోడ్ షో

హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి

రేపు ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ రోడ్ షో

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం 02 :  పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఈనెల మూడవ తేదీన శుక్రవారం ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తదితర ముఖ్యనేతలు పాల్గొంటారు. సాయంత్రం ఐదుగంటలకు మొదలయ్యే ఈరోడ్ షో జెడ్పీసెంటర్ మీదుగా బోనకల్ క్రాస్ రోడ్, ముస్తఫానగర్ నుంచి చర్చికాంపౌంద్ చేరుకుంటుంది. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి శ్రీనివాసనగర్ అయ్యప్పస్వామి టెంపుల్ మీదుగా బోస్ బొమ్మ సెంటర్, రాజీవ్ చౌక్ నుంచి గాంధీచౌక్ చేరుకుటుంది. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి