రాహుల్ గాంధీ నేతృత్వంలోనే సంక్షేమ పాలన సాధ్యం
శ్రీదేవి నర్సింగ్ హోo ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 05 : ఎలాంటి మత విద్వేషాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించడం రాహుల్ గాంధీ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్ఎస్ టీ రోడ్డు శ్రీదేవి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన స్థానికులు, వివిధ పార్టీల నాయకులు, మేధావులను ఉద్దేశించి రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరూ హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొల్లికొండ శ్రీదేవి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, మక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List