తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఐ ఎన్ బి టైమ్స్ తిరుమలాయపాలెం మే 07 : ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక లాపాలపై నిఘా పెట్టాలని సూచించారుసామజిక మాధ్యమాలలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు ముమ్మరం చేయాలని, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ....పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు.
Comment List