పలనాడు లో వైసీపీ కి బిగ్ షాక్
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 14: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సామాన్యుడు పేద కుటుంబం నుండి వచ్చి రాజకీయంలో ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే జంగా కృష్ణ మూర్తి అతి సన్నిహితుడైన గద్దెల వేదమని వైసిపి పార్టీలో చాలా చురుకైన నాయకుడుగా పనిచేసి మంచి పేరు సాధించుకున్నాడు కొన్ని కారణాలవల్ల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి వైసీపీ పార్టీని వీడిన టిడిపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నరసరావుపేట పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షులు గద్దెలవేదమని వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది
త్వరలో జంగా కృష్ణమూర్తి సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు పత్రికా విలేకరులకు తెలియజేశారు. నాకు రాజకీయ గురువు జంగా కృష్ణమూర్తి అతని ప్రయాణం ఎలా ఉంటే నా జీవిత ప్రయాణం కూడా అలానే సాగుతూ ఉంటుందని రాజకీయంలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన అన్నారు. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
Comment List