సిపిఎం కార్యకర్తలు వినోద్న ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక

సిపిఎం కార్యకర్తలు వినోద్న ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక

 ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 21: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన సిపిఎం ముఖ్య నాయకులు శనివారం నాడు బీజేపీ లో చేరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవి  అధ్వర్యంలో పార్టీ పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి వినోద్ రావు సమక్షంలో అద్దంకి గురున్నాధం, గోపి, మహేష్, సాయి, వెంకటేష్, హరి, సురేష్, ఉపేందర్, చైతన్య,  మహేష్, నర్సింహా, వీరబాబు, హరికృష్ణ, శంకర్, ఏలూరి కిరణ్,  యాభై మంది యువకులు  నరేంద్ర మోడీ  చేస్తున్న అభివృద్ధికి,  పేద బడుగు బలహీన వర్గాలు కోసం  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  బీజేపీ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం కోసం కృషి చేయాల్సిందిగా వినోద్ రావు వారిని కోరారు. గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.  ఎన్నికల్లో గెలిచిన తరువాత వారి స్వలాభం కోసం చూసుకున్నారే కానీ జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈసారి ఖమ్మంలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా నున్న రవి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ  ప్రభంజనం మాత్రమే కొనసాగుతుందన్నారు. గిరిజనులకు కేవలం బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందన్నారు.
 ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు భాన్య నాయక్, గజ్జెలశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దేశంలోని తొలి ప్రయివేటు రైలు   --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని