రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..

మల్లేపల్లిలో ఆలయాల ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగలేటి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అర్. రఘురాం రెడ్డి

రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి ఏప్రిల్ 26:  మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో  ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వచనం పొందారు. అనంతరం ఇదే గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుక కు హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..మొక్కుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ జూకూరీ గోపాలరావు, నాయకులు నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి, , రామ్మూర్తి నాయక్, హఫీజ్ ఉద్దీన్, కొప్పుల చంద్రశేఖర రావు,  శ్రీనివాసరెడ్డి, తమ్మినేని నవీన్, సూర్య నారాయణ రెడ్డి, పెండ్ర అంజయ్య, సెట్ రామ్ నాయక్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo
ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం మే 08 : ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అందులో కొత్తగూడెం, ఖమ్మం ఉండాలంటే...
దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్