సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్...

సీఎం జగన్ పై దాడి కేసులో A2 ఎవరు..?

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్...

ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి ఏప్రిల్ 21:సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు..అసలు కారణం ఇదే! సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు కొందరు ఆగంతకులు.దీనిపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు 20 ప్రత్యేక పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, ఘటనా స్థలంలో సేకరించిన మూడు రాళ్లపై ఉన్న వేలిముద్రలు అధారంగా దర్యాప్తు చేపట్టాయి. ఇందులో ఏ1గా సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం సతీష్‌ నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే సతీష్ రిమాండ్ రిపోర్ట్‎లో A2 ప్రోద్బలం తోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఏ2 ఎవరన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగానే అనుమానితుడుగా ఉన్న దుర్గారావును విచారణకు తీసుకెళ్లారు. అయితే విచారణ తరువాత అతనికి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని భావించిన పోలీసులు శనివారం అర్థరాత్రి ఆయనను తన ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు.దీనిపై పోలీసులు స్పందిస్తూ కేవలం విచారణ నిమిత్తం దుర్గారావును తీసుకెళ్లామని ఎలాంటి సంబంధం లేదని తెలిసి వదిలిపెట్టామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏ2 ఎవరా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరం చేశామని త్వరలోనే ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిని పట్టుకుంటామంటున్నారు పోలీసులు.

Tags:
Views: 38

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం