బీజేపీలో చేరిన తల్లాడ ఎంపీటీసీ
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 25: ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నాయకత్వంలో, పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సమక్షంలో,భారీగా చేరికలు జరుగుతున్నాయి. తల్లాడ మండల స్వతంత్ర ఎంపీటీసీ చల్లా తిరుమలదేవి నాగులు దంపతులు, అనుచరులు భారతీయ జనతా పార్టీ లో చేరారు.వినోద్ రావు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం ఈ చేరికలు జరిగాయి. బీజేపీలో చేరిన వారిలో చల్లా నవీన్, చల్లా రాము, చల్లా వెంకట్, చల్లా రాము కుమార్, కిరణ్, ప్రవీణ్, మరియు ఇతర నాయకులు కూడా ఉన్నారు.ఈ సందర్బంగా ఎంపిటీసీ తిరుమలదేవి మాట్లాడుతూ-దేశంలో నరేంద్ర మోడీ, ఖమ్మం లో వినోద్ రావు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించి బీజేపీలో చేరామని చెప్పారు. మోడీ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా, పేద బడుగు బలహీనవర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. బీజేపీలో చేరిన వారికి వినోద్ రావు, గల్లా సత్యనారాయణ కాషాయ కండువా కప్పి స్వగతం పలికారు. బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ ల నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని, దేశ అభివృద్ధి మోడీ తోనే సాధ్యమని అన్నారు. దేశ సంక్షేమం, అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీ లో చేరాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comment List