బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ - తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరులోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు
ఐ ఎన్ బి టైమ్స్ కల్లూరు ఏప్రిల్ 14 : బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండలం అంబేడ్కర్ నగర్ లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు పేదల దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణామన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కల్లూరు పట్టణ కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి , మట్టా దయానంద్, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comment List