జనాధారణ చూసి ఓర్వలకే ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్న చంద్రబాబు అండ్ కో
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం గాజువాక ఏప్రిల్ 14 : రాష్ట్ర ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదారణ చూసి ఓర్వలకే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అతని అనుచరులు జగన్మోహన్ రెడ్డి పై ఇటువంటి భౌతిక దాడులకు దిగుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తూ జీవీఎంసీ 74 వ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు పరిధి అంబేద్కర్ కోలని వద్ద రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడుతూ నిన్న విజయవాడలో జరిగిన సిద్ధం బస్సు యాత్రలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి రాయి దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజల ఆశీస్సులు, విజయవాడ కనకదుర్గమ్మ దయతో ఎటువంటి పెద్ద గాయం కాకుండా ఎడమే కంటి పైన తగిలిందని చెప్పేరు. ఇప్పటికైనా ఇటువంటి నీచ రాజకీయాలను చంద్రబాబు నాయుడు మానుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్కటే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 74 వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు పాల్గొన్నారు.
Comment List