అంబేద్కర్ సేవలు అజరామరము -- ఘనంగా 133వ జయంతి
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 : భారతదేశం తో పాటు ప్రపంచ దేశాలకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన సేవలు అజరామరమని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయము సలహామండలి సభ్యులు, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు.134వ జయంతిని పురస్కరించుకుని శ్రీను బాబు కేటీబీ కళా క్షేత్రం తో పాటు పలు ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటము వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీను బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్అనేక సంస్కరణలకు ఆద్యుడన్నారు.దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఐదు వేల సంవత్సరాల ఈ జాతి చరిత్ర గతిని తిరగరాసి, నీకోసం నాకోసం మొత్తం జాతి సమానత్వం కోసం తుది శ్వాస దాక అలుపెరగని పోరాటం చేసి, కేవలం చదువే ఆయుధంగా అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన మేరునగ ధీరుడు లాంటి అంబేత్కరులు తయారు కావాలని, మళ్ళీ మన దేశంలో ఆయన జన్మించాలని శ్రీను బాబు ఆకాంక్షించారు.
Comment List