భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్
పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల కు, చిత్ర పటాలను ఘన నివాళిలు అర్పించిన వంశీ * జై భీమ్ నినాదాలతో వాడ వాడలా పండుగ వాతావరణం
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో పాల్గొని, అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫిషింగ్ హార్బర్ లో విశాఖ బోట్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొని , అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఏ..వి.ఎన్ కాలేజ్ దరి , జై గౌతమ్, బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవములు లో వంశీ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళుర్పించారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎ వి యన్ కాలేజీ జంక్షన్ వద్ద అంబేద్కర్ స్థానిక నేతలతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 30 వార్డ్ తాడి వీధి లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో స్థానిక పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలతో అంబేద్కర్ జయంతి వేడుకలో వంశీ పాల్గొన్నారు. ఎల్.ఐ.సి కూడలి వద్ద గల అంబేద్కర్ జయంతి వేడుకలో వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గ జనసేన, టిడిపి ,బిజెపి నాయకులు తో అంబేద్కర్ గ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.```
Comment List