విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైస్సార్సీపీ విశాఖ ఎంపీ శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు, ఆదివారం ఉదయం రామ్ నగర్ 28 వ వార్డు వైసీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎం వి వి సత్యన్నారాయనతో పాటు కార్యక్రమం లో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఏమైనా ఉంటే తమ వాదన ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవలని భౌతిక దాడులు తగవని హితవు పలికారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. విజయవాడ లో నాలుగున్నర గంటలపాటు జరిగిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మరధం పట్టరాని దీనిని చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారన్నారు.
Comment List