డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించిన జంగా
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 14: దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి నార్కెట్పల్లి పక్కనే ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జంగా కృష్ణమూర్తి మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, జoగా మాట్లాడుతూ ఆ మహనీయుని స్మరికుందాం
ప్రజాస్వామ్య,గణతంత్ర,లౌకిక, సామ్యవాద రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం...డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మాటల్లో మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం.. రెండూ తప్పే.దేశానికి గానీ, జాతికి గానీ సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యా వంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. వినయం, శీలం లేని విద్యావంతుడు, పశువు కంటే ప్రమాదకరమని నేడు ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు. అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు. దేశ ప్రజలందరికీ.స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు కృషిచేసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List