కవితను కలిసిన కేటీఆర్..

కవితను కలిసిన కేటీఆర్..

ఐ ఎన్ బి టైమ్స్ ఢిల్లీ ఏప్రిల్ 15: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కలిశారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కేటీఆర్ కలవడం ఇదే తొలిసారి. కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కూడా ఉన్నారు.కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. లిక్కర్ కేసులో న్యాయపోరాటంపై కవితతో కేటీఆర్ చర్చించారు. సీబీఐ కస్టడీ సమయంలో ప్రతిరోజూ గంటపాటు కుటుంబ సభ్యులను కవిత కలిసేందుకు వెసులుబాటు ఉంది. గతంలో ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు కేటీఆర్. కస్టడీ పొడిగింపు? కవిత సీబీఐ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి కావేరి భవేజా ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టనుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు అధికారులు వివరిస్తారు. కవిత సీబీఐ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని సీబీఐ చెప్పింది.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..