ఓటరు చైతన్య కార్యక్రమం-- ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

-జెండా ఊపి 5కె రన్ ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఓటరు చైతన్య కార్యక్రమం-- ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్, ఏప్రిల్ 16: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు అవగాహన ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీప్ 5K రన్ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం  జిల్లా కేంద్రంలో  ఆర్టీసి బస్టాండ్  వద్ద  జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటు శాతం కంటే ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో నమోదు కావాలని కోరారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కువినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.  దేశ భ‌విష్యత్తును నిర్దేశించేది ఓటు హ‌క్కు  అని దానిని ప్రజ‌లు గుర్తించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. క‌ళాశాల‌ల‌తో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించ‌డం జ‌రుగుతోంద‌ని.. అదే విధంగా వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనూ వినూత్న ఓట‌రు జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.త‌ప్పనిస‌రిగా ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కళాకారుల బృందం  ఓటు హక్కు వినియోగంపై పాటలు పాడి అవగాహన కల్పించారు.  ఈ స్వీప్ 5కె రన్ బస్టాండ్ వద్ద ప్రారంభమై అండర్ బ్రిడ్జ్ , జిల్లా ఆసుపత్రి,  నెహ్రూ సెంటర్ ద్వారా ఎం.ఆర్.ఓ కార్యాలయం వరకు చేరుకొని ముగిసింది. ఈ 5కె రన్ లో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, రెవెన్యూ లెనిన్ వత్సల్ టొప్పో, ఎం.డేవిడ్,డి.ఎఫ్.ఓ బత్తిని విశాల్, ట్రైనీ ఐ.పి.ఎస్. పండరి చైతన్, అదనపు ఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓ అలివేలు, స్వీప్ నోడల్ అధికారి జీనుగు మరియన్న, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయి, మునిసిపల్ కమీషనర్ రవీందర్, డి.ఈ.ఓ రామారావు, పశు సంవర్ధక శాఖ అధికారి సుధాకర్, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్ ,స్థానిక ఎం.ఆర్.ఓ భగవాన్ రెడ్డి, ఎన్.వై.కె కోఆర్డినేటర్ అవినాష్, ఇతర జిల్లా అధికారులు,వైద్య అధికారులు, డి.ఆర్.డీ.ఏ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థులు,యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 28

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..