రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం. హామీల అమలు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.

రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం.  హామీల అమలు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్18:  మంచిర్యాల్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గం మరో వినూత్న ఉద్యమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. చెన్నూర్ నియోజకవర్గం, చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు స్వచ్చందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కోరారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తాం అని రైతులు హెచ్చరించారు.గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. 1.వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ.500,2.రైతు భరోసా రూ.10వేలకి బదులు రూ.15వేలు ఇవ్వాలి.3.రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12వేలు చెల్లించాలి. 4.రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి. 5.వీటితోపాటు రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25వేలు చెల్లించాలి.అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు.రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..