గవరపాలెంలో జోరుగా వైసిపి ఎంపీ, ఎమ్మేల్యే అభ్యర్ధుల ప్రచారం.
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ అనకాపల్లి ఏప్రిల్ 10 :సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులగా పోటీ చేస్తున్న తమను గెలిపించమని, గవరపాలెం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్ధి మలసల భరత్ ఓట్లర్లను కోరారు. అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలహీన వర్గాల వారి తరఫున రైతు కుటుంబానికి చెందిన తనను ప్రజలంతా ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఎంపీగా తనని ఎమ్మేల్యేగా భరత్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపముఖ్యమంత్రి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Views: 4
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List