దక్షిణ వైసీపీలోకి టిడిపి జనసేన శ్రేణులు...:*
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి*
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 : జీవీఎంసీ 35 వ వార్డు నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో టిడిపి జనసేన పార్టీ శ్రేణులు వైసీపీలో చేరారు. ఆ వార్డు వైసిపి అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నూనె మిల్లు ఆటో స్టాండ్ సంఘం, టిడిపి, జన సేన సభ్యులకు కండువా కప్పి వాసుపల్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి భరోసా ఇచ్చారు. దక్షిణంలో ప్రతిపక్షాలు ఫ్యాన్స్ స్పీడుకు చెదిరిపోయేలా అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ కి వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గెలిపించుకోవాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అలుపన బుజ్జి, చిల్లా సీతారెడ్డి, లాలం రాము, బాడిత సురేష్, అలుపన సూర్యనారాయణ, నెల్లి రమణ, అలుపన దసరా, దుంప రమణ, నాయన రాము, అలుపన జగన్నాథం, నెల్లి కన్నబాబు, రాజన అప్పారావు, నిద్ర బింగ రాము, రాజన నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comment List