విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో తనిఖీల్లో భాగంగా బంగారం పట్టివేత
ఐ ఎన్ బి టైమ్స్ విజయనగరం ఏప్రిల్ 14: విజయనగరం పట్టణంలోని కన్యక పరమేశ్వరి టెంపుల్ వద్ద ఏప్రిల్ 12న రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్సై నవీన్ పడాల్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపడుతూ, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని ఆపి, తనిఖీ చేయగా అతని వద్ద 2.663 కిలోల బంగారు వస్తువులు, రూ.17,95,000/- ల నగదు సీజ్ చేశారు. బంగారు వస్తువులు, నగదుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పంచనామా రిపోర్ట్ వ్రాసి, డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీ మరియు ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటుకు తదుపరి చర్యలు నిమిత్తం పంపినట్లుగా సిఐ బి.వెంకటరావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి భీమిలి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అమర రాజయ్య అని, అతను విశాఖపట్నం గోల్డ్ గెయిన్ అనే జ్యువలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నట్లు, సదరు షాపు యజమాని పవన్ కుమార్ విజయనగరంలోని బంగారు షాపులకు వస్తువులను విక్రయించి, డబ్బులు తీసుకొని రమ్మనమని చెప్పినందున, వాటిని విజయనగరం తీసుకొని వచ్చినట్లుగా విచారణలో వెల్లడించారని సిఐ బి.వెంకటరావు తెలిపారు. సీజ్ చేసిన బంగారు వస్తువుల విలువ రూ. 1 కోటి 51 లక్షల 10 వేలు గా అంచనా వేశామని తెలిపారు.
Comment List