రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడిని తీవ్రముగా ఖండించిన బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి.
ఐ ఎన్ బి టైమ్స్ బద్వేల్ ఏప్రిల్ 14: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్ర ద్వారా వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక రాళ్ల దాడి చేయించడం
చాలా హేయమైన చర్య అని బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని జగన్మోహన్ రెడ్డి రాకతో అశేష జనావాహిని ఆయనకు అడుగడుగునా నీరాజనం పట్టారు. ఇది చూసి ఓర్వలేక దాడి చేయించడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామని తెలియజేశారు. ప్రజాస్వామ్యా పద్ధతిలో ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్రకు ఎక్కడ చూసినా మహిళలు, ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి ఓర్వలేకనే నేడు రాళ్ల దాడి చేయించడం సరైన పద్ధతి కాదని విశ్వనాధరెడ్డి తెలియచేశారు. దేవుడి దయవల్ల, ప్రజల ఆశీస్సులు వల్ల ఈ దాడి నుంచి సురక్షితముగా బయటపడటం అనేది ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవ మరియు సంక్షేమ ఫలాలే ఆయనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
Comment List