ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన డ్రైవర్.. వాహనంపై పడిన మృత దేహంతో 18కి.మీ దూరం ప్రయాణo ‼️
ఐ ఎన్ బి టైమ్స్ వై. కొత్తపల్లి ఏప్రిల్ 15: వై. కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘటన, కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి (35) ట్రాక్టర్ మెకానిక్. ఆత్మకూరు మండలంలోని పి. సిద్దరాంపురానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకొని అనంతపురంలో స్థిరపడిన ఫ్యామిలీ.. వ్యక్తిగత పనులపై పి. సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణం.. వై. కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీకొన్న వైనం..దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయారు. గమనించని డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు పయనం..బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపించారు. డ్రైవర్ కారును వదిలి పరార్..కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తింపు.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడి..
Comment List