వైసిపి పార్టీ ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టిడిపి కార్యకర్త మృతి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ఏప్రిల్ 15 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లోని అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం రాత్రి ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టీడీపీ కార్యకర్త ఆలేటి సాలోమన్(46) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి జరిగిన సంఘటన తెలుసుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..వైసీపీ ఊరేగింపు లో కూడా మా రక్త తిలకం కావలేమో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మృతుడి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. గతంలో కంభంపాడు వద్ద నా కాన్వాయ్ లో ఒక వాహనం ఆటోను ఢీ కొని, ఒకరికి స్వల్పగాయాలు అయితే నాపైన ఎస్సి,ఎస్టీ,హత్యాయత్నం కేసులు పెట్టించారు.మీలా నీచ రాజకీయాలు చేయాలని మేము అనుకోము,మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని సాలోమన్ కుటుంబానికి అండగా ఉంటానని,అతని పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Comment List