వైసీపీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి బ్రదర్స్
*ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 16: ఏలూరులోని నారాయణపురం స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు.
తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు
కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
Comment List