*పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆడారి మాలతి*
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10: గోపాలపట్నం 91 వ వార్డులో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి , పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి , 92 వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివ దేవి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో కొంత సేపు ముచ్చటించి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర, పార్లమెంట్, సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు రాష్ట్ర డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List