భీమిలి,తగరపువలస ప్రెస్ క్లబ్స్ జర్నలిస్టులకు స్వీట్స్ పంపిణీ
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 : సమాజానికి నిలువెత్తు అద్దం జర్నలిస్టులేనని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు.బుధవారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమిలి,తగరపువలస ప్రెస్ క్లబ్స్ జర్నలిస్టులకు ఉగాది సంబరాలను నిర్వహించి సభ్యులకు మిఠాయిలు అందజేసారు..ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఆశయ ఫలాలను అందరికి అందివ్వడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు.. గత ఆరేళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.. నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు..తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. భవిష్యత్ లో జర్నలిస్టులకు ఎటువంటి కష్టం వచ్చినా అసోసియేషన్ పరమైన సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో తగరపువలస,భీమిలి ప్రెస్ క్లబ్స్ సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comment List