సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్14: మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ సీపీఐ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మట్లాడుతూ అంటరాని తనానికి వ్యతిరేకంగా కులరహిత సమాజం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల స్రీల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్తులను అధ్యయనాలు చేసి వారి అభివృద్ది కోసం రాజ్యాంగం నిర్మాణం చెసి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వల్లనే సమాజం లో ప్రజల హక్కులు కాపాడ బడుతున్నాయి అన్నారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దళితుల పై మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు మణిపూర్ గటనే దీనికి నిదర్శనం అన్నారు కేంద్రంలో మళ్ళి బిజేపి అధికారం లోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుంది అని రాజ్యాంగాన్ని రక్షించు కోవలసిన బాధ్యత మన అందరిమీదా ఉంధి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్ట పెల్లి పౌలు,పెర్క సంపత్, కాదండీ సాంబయ్య,సీపీఐ నాయకులు సురిమిల్ల వినయ్,మామిడాలా సత్తి,అన్నం శ్రీనివాస్, మామిడి గోపి,ఎగుడా మొండి, వెంకటేష్,క్లిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List