రెండు లక్షల రూపాయలతో స్వాతి డెంటల్ కేర్ వారి ఆధ్వర్యం లొ జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 20 : బుధవారం జ్ఞానాపురం నందు యర్ర్నీ మాంబా అమ్మవారి దేవస్థానం నందు భక్తులు అవసర నిమిత్తమై స్వాతి అడ్వాన్స్డ్ డెంటల్ మెడికల్ కేర్ వారి ధన సహాయంతో డాక్టర్ ఎస్ భరత్ డాక్టర్ స్వాతి కుమారి ఆర్థిక సహాయంతో సుమారు రెండు లక్షలు విలువచేసే ప్యూర్ ఫైన్ వాటర్ ఫిల్టర్ ఎర్ని మాంబ ఆలయం నందు ఆలయ ఈఓ డివిఎస్ సురేష్ బాబా మరియు డోనార్ కుటుంబ సభ్యులైన పి ధర్మారావు ఎస్ బాలకృష్ణ తదితరులు ప్రారంభించడం జరిగినది.భక్తుల అవసర నిమిత్తమై నిత్యం అందరికీ మంచి నీరు సరఫరా చేయాలని ఆలోచనతో ఈ యొక్క వాటర్ ఫిల్టర్ ను అందుబాటులో తీసుకొచ్చామని డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ పూజారి పులకండన శ్రీకాంత్ శర్మ ఆలయ చైర్మన్ లండ రమణ ఆలయ ట్రస్టీలు మౌని వాసుపల్లి నారాయణరావు ఆదినారాయణ చక్క శ్యామ్ సుందర్ రెడ్డి తేజ రత్నం కనితి గౌరీ ఎలాశెట్టి దేవి కోసెట్టిదేవి కర్రి దానయ్యమ్మ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comment List