భారీ ధర పలికిన ఆనందపేట గణేష్ లడ్డు వేలం@7.10లక్షలు.. గొంటు ఆదిరెడ్డి

భారీ ధర పలికిన ఆనందపేట గణేష్ లడ్డు వేలం@7.10లక్షలు.. గొంటు ఆదిరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 09:మండల కేంద్రమైన రెంటచింతల లోని ఆనందపేట లో ఉత్కంఠ భరితంగా సాగిన గణేష్ లడ్డు భారీ వేలంపాట రూ౹౹ 7.10 లక్షల ధరతో లడ్డు ను కైవసం చేసుకున్న గొంటు ఆదిరెడ్డి కుమారులు వైస్. ఎంపిపి గొంటు.సుమంత్ రెడ్డి,గొంటు.రవి కుమార్ రెడ్డి లు.వినాయకుని లడ్డు దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు.ఈ వేలంపాట లోని సొమ్మును దేవాలయ నిర్మాణానికి ఉపయోగిస్తారని భక్తులు తెలిపారు.వినాయకుడి ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని బాణా సంచ కాల్పులతో, బ్యాండ్ మేళాలతో,డి.జె లతో గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.అనంతరం గొంటు సుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు.

Tags:
Views: 18

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ