భారీ ధర పలికిన ఆనందపేట గణేష్ లడ్డు వేలం@7.10లక్షలు.. గొంటు ఆదిరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 09:మండల కేంద్రమైన రెంటచింతల లోని ఆనందపేట లో ఉత్కంఠ భరితంగా సాగిన గణేష్ లడ్డు భారీ వేలంపాట రూ౹౹ 7.10 లక్షల ధరతో లడ్డు ను కైవసం చేసుకున్న గొంటు ఆదిరెడ్డి కుమారులు వైస్. ఎంపిపి గొంటు.సుమంత్ రెడ్డి,గొంటు.రవి కుమార్ రెడ్డి లు.వినాయకుని లడ్డు దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు.ఈ వేలంపాట లోని సొమ్మును దేవాలయ నిర్మాణానికి ఉపయోగిస్తారని భక్తులు తెలిపారు.వినాయకుడి ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని బాణా సంచ కాల్పులతో, బ్యాండ్ మేళాలతో,డి.జె లతో గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.అనంతరం గొంటు సుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు.
Comment List