జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 14:జగన్ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లులో అద్దేపల్లి జయంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నిమ్మల ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... ఏపీలో వరదలకు కారణం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు గ్రహించారని అన్నారు. సీఎం చంద్రబాబు 74 సంవత్సరాల వయస్సులో వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారని తెలిపారు.బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని అన్నారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొనియాడాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో విజయవంతం చేయగలిగామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
Comment List