జర్నలిస్టుల సేవలు సమాజానికి అవసరం...దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 9:ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి అవసరమని విశాఖ దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.జర్నలిస్ట్ డే సందర్భంగా నగరంలో పని చేస్తున్న పలువురు జర్నలిస్టులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు ప్రభుత్వానికి ప్రజలకు అవసరమన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించి జర్నలిస్టులను సన్మానించిన డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో కష్ట నష్టాలకు, వ్యయ ప్రయాసలకు ఓర్చి వార్తలు సేకరించి సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారికి తానెప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం పూర్తిగా తనను అభిమానించే జర్నలిస్టు సోదర సోదరీమణుల సహకారంతోనే ముందుకు వెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవిత స్వప్నమైన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా మన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది జర్నలిస్టులను దుశ్శాలువలతో సత్కరించి డ్రై ఫ్రూట్స్ బాహూక రించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బదరీనాథ్, తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి రామ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List