13 మ్యాచ్‌లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు

13 మ్యాచ్‌లు.. 11 ఓటములు.. 2 డ్రాలు.. తొలి విజయం కోసం ఎదురుచూస్తోన్న బంగ్లా పులులు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17:భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.గురువారం(సెప్టెంబర్19)నుంచిప్రారంభంకానున్నఈసిరీస్ఇరుజట్లకుఎంతోకీలకం.ఎందుకంటే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.గణాంకాల ప్రకారం ఇక్కడ భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో టీమిండియా మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో భారత జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా గెలవలేదు. అయితే 2 మ్యాచ్‌ల్లో డ్రా చేసుకోగలిగింది. తద్వారా భారత్‌తో సిరీస్‌ను డ్రా చేసుకోగలిగితే బంగ్లాదేశ్ జట్టుకు అది గొప్ప విజయం అవుతుంది.భారత్, బంగ్లాదేశ్‌లు చివరిసారిగా 2022లో టెస్టు సిరీస్ ఆడాయి. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. చివరి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. అంటే బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులు చేయగా, భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది.రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కాబట్టి, ఈ సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ జట్టు నుంచి ఉత్కంఠభరిత పోరును ఆశించవచ్చు.బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మద్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ , తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ.భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ , కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, యష్ దయాల్.

 
Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ