నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా...
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 17:ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతల ఆగడాలు ఇంకా తగ్గడంలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ నేతల చేష్టలు పెరిగిపోతున్నాయి. వీరి ఆగడాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి.నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు గ్రీవెన్స్లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను రేప్ చేసినట్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది.
Tags:
Views: 1
About The Author
Related Posts
Post Comment
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List