వంశీకృష్ణ శ్రీనివాస్ కు పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఘన సన్మానం
1.వరద బాధితుల సహాయార్థం లక్ష చెక్కును ఎమ్మెల్యే కి అందజేసిన క్లబ్ సభ్యులు! 2 .ఐదు వందల మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేసిన క్లబ్ కమిటీ సభ్యులు!
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం సెప్టెంబర్ 10 : వైజాగ్ పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి క్లబ్ వారి ఆనవాయితీ ప్రకారం గౌరవ అధ్యక్షులుగా మరియు ఆ గౌరవ సభ్యునిగా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం లో ఉన్న 500 మంది నిరుపేద మహిళలకు చీరలును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు . అదేవిధంగా విజయవాడలో వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే కి అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు గజమాల వేసి, శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ పెద్దలు తాతాజీ , రాజుపాత్రుడు , విష్ణుమూర్తి , వాసు , శ్రీనివాస్ ,కృష్ణంరాజు , భరత్ , స్థానిక కార్పొరేటర్ , మాజీ కార్పొరేటర్లు , కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Comment List