వంశీకృష్ణ శ్రీనివాస్ కు పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఘన సన్మానం

1.వరద బాధితుల సహాయార్థం లక్ష చెక్కును ఎమ్మెల్యే కి అందజేసిన క్లబ్ సభ్యులు! 2 .ఐదు వందల మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేసిన క్లబ్ కమిటీ సభ్యులు!

వంశీకృష్ణ శ్రీనివాస్ కు పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఘన సన్మానం

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం సెప్టెంబర్ 10 :  వైజాగ్ పటం క్లబ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే  వంశీకృష్ణ శ్రీనివాస్ కి క్లబ్ వారి ఆనవాయితీ ప్రకారం గౌరవ అధ్యక్షులుగా మరియు ఆ గౌరవ సభ్యునిగా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం లో  ఉన్న 500 మంది నిరుపేద మహిళలకు చీరలును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్  చేతుల మీదుగా పంపిణీ చేశారు . అదేవిధంగా విజయవాడలో వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే కి అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు గజమాల  వేసి,  శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్  మాట్లాడుతూ క్లబ్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని తెలియజేశారు.  కార్యక్రమంలో క్లబ్ పెద్దలు తాతాజీ , రాజుపాత్రుడు , విష్ణుమూర్తి , వాసు , శ్రీనివాస్  ,కృష్ణంరాజు , భరత్ , స్థానిక కార్పొరేటర్ , మాజీ కార్పొరేటర్లు , కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Tags:
Views: 116

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ