నూతన జంటకు ఆశీర్వాదం.. జక్కంపూడి కి పరామర్శ
కొనసాగిన పొoగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
ఐ ఎన్ బి టైమ్స్ తల్లాడ/పెనుబల్లి మార్చి 24: ఇటీవల అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బిల్లుపాడు మాజీ సర్పంచ్ జక్కంపూడి కృష్ణమూర్తిని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తల్లాడ మండలం బిల్లుపాడు లోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రంగారావు బంజర లో..: పెనుబల్లి మండలం రంగారావు బంజరలో సోమరాజు సీతారామరావు కుమారుడు పవన్- పావని నూతన వధూవరులను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం ఆశీర్వదించారు. కొత్త జంట రిసెప్షన్ కు హాజరై.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, దయానంద్ దంపతులతో కలిసి దీవించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కీసరి శ్రీనివాసరెడ్డి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నవజీవన్, వంగా దామోదర్, వై.నరసింహారావు, తుమ్మలపల్లి రమేష్, బానోత్ నరసింహారావు, దీవిల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Comment List