ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం రాత్రి కూసుమంచిలో ఏర్పాటు చేసిన ఇస్తారు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, ముస్లింలు ఆయనకు ఇమామి జామిన్ కట్టి, రుమాల్ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులపాటు ఎంతో నిష్టతో జరుపుకునే ఈ ఉపవాస దీక్షల వల్ల అందరికీ ఆకలి దప్పుల విలువ తెలుస్తుందని అన్నారు.  విజయవంతంగా ఉపవాసాలన్నీ పూర్తి కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లింలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు అహమధ్ అలీ నివాసానికి వెళ్లి.. ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింప చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం