ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం రాత్రి కూసుమంచిలో ఏర్పాటు చేసిన ఇస్తారు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, ముస్లింలు ఆయనకు ఇమామి జామిన్ కట్టి, రుమాల్ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులపాటు ఎంతో నిష్టతో జరుపుకునే ఈ ఉపవాస దీక్షల వల్ల అందరికీ ఆకలి దప్పుల విలువ తెలుస్తుందని అన్నారు. విజయవంతంగా ఉపవాసాలన్నీ పూర్తి కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లింలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు అహమధ్ అలీ నివాసానికి వెళ్లి.. ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింప చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.
Comment List