తలపాగా చుట్టి..డోలు వాయించి..
లోక్యాతండాలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సందడి.బంజారాలతో కలిసి హోలీ.. కేళి
ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: హోలీని పురస్కరించుకొని సాయం సంధ్య వేళ పిల్లలు..యువతీ యువకులు..మహిళలు..పెద్దలు ..అంతా ప్రధాన సెంటర్ లో గుమి గూడి ఉండగా..కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకొని ..వారిలో ఒ కరిగా మారి మరింత సందడి చేశారు. ఈ ఘటన కూసుమంచి మండలం లోక్యా తండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. హోలీ పండుగను పురస్కరించుకుని.. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి లోక్యా తండాకు వెళ్లి.. వారితో మమేకమై.. ఆడి పాడి సందడి చేశారు. గిరిజనులు వారి సంప్రదాయ సేవ్లాల్ పాకిడీ(తల పాగా) చుట్టారు. ఆ తర్వాత డోలు చేత బట్టి వాయించి మరింత ఉత్సాహం నింపారు. కోలాటం ఆడుతూ.. వారి సంప్రదాయ నృత్యంలో అడుగులేస్తూ.. హోలీ నీ ఆనందాల కేళి చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ వడిత్యా తావూరియా, రాజుల నివాసాలకు వెళ్లి.. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల నాటి సంప్రదాయాలను కొనసాగిస్తూ.. అందరూ కలిసి ఈ హోలీని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List