గురజాల నియోజకవర్గం లో పసుపుజెండా ఎగరేస్తాము..
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మార్చి 26: తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పధకాలు మరియు యరపతినేని సొంత ఖర్చు లతో ఇస్తున్న 6 పధకాలు ఇచ్చిన ప్రతిహామీ యరపతినేని శ్రీనువాసరావు నెరవేరుస్తారు అని తెలియజేస్తున్నా!*చిలుములదుర్గారావు టీడీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి విభిన్న ప్రతిభా వంతుల విభాగం ఆంధ్రప్రదేశ్.ప్రతిపక్షంలో ఉన్నా అహర్నిశలు సేవలందించారుమన *యరపతినేని శ్రీనువాసరావు .. గురజాల నియోజకవర్గం లో యరపతినేని *చేసిన పనుల్లో 10శాతం కూడా కాసు చేయలేదుపెన్షన్లలోనూ రాజకీయం చేస్తున్న దుర్మార్గుడు జగన్: గత ఎన్నికల్లో యరపతినేని ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నాడు . గెలిచిన కాసు మహేష్ రెడ్డియరపతినేని చేసిన సంక్షేమంలో పదో వంతు కూడా ప్చేయలేదని టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల విభాగం ప్రధాన కార్యదర్శిచిలుములదుర్గారావు పేర్కొన్నారు. దుర్గారావు మాట్లాడుతూ... ప్రజలందరి ఆశీస్సులతో ఈసారి గురజాల నియోజకవర్గం లో పసుపుజెండా ఎగురవేస్తాo, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి రాష్ట్రం లోనే ఆదర్శంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారు . యరపతినేని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పోరాడి అత్యధిక నిధులు తెస్తారు . ఎన్నికల సమయంలో కాసు మహేష్ రెడ్డి అద్భుతంగా నటిస్తారు, ఆ తర్వాత కన్పించకుండా పోతారు.
పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం: టిడిపి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి – సంక్షేమాలను జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం
చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో ఉంచారు. కుంటిసాకులతో సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు, పెన్షన్లలో కూడా రాజకీయం చేస్తున్న దుర్మార్ముడు జగన్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా చైతన్యవంతులై తరిమికొట్టాలని దుర్గారావు పిలుపునిచ్చారు
లోకేష్ బాబు . 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర వారి దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రజలకు అండగా నిలచేందుకు చంద్రబాబు పవన్ సూపర్ – 6 కార్యక్రమాలను ప్రకటించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక గతంలో బీసీ, ఎస్సీ మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమపథకాలను పునరుద్దరిస్తారు . హజ్ యాత్రకు వెళ్లేవారికి సాయం పెంచుతారు . ఏటా జాబ్ కేలండర్ తో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు . పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరించి, వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని లోకేష్ బాబు హామీ ఇచ్చారు.
ఇంకా ఎంతమందిని పొట్టనబెట్టుకుంటారు?!జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు పెరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే బాలుడు తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులపెట్టారు. నిందితుడికి బెయిల్ వస్తే ఊరేగింపుతో తీసుకెళ్లారు. సీఎం సొంత జిల్లాలో చేనేత సోదరుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ ఎమ్మెల్యేనే కారణం. ఆయన భూమిని బినామీల పేరుతో కబ్జా చేయడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దళితులను కూడా వదిలిపెట్టలేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, పలమనేరులో మిస్బా ఆత్మహత్యకు వైసీపీనే కారణం. నర్సరావుపేటలో వక్ఫ్ భూముల కోసం పోరాడిన ఇబ్రహీంను నడివీధిలో నరికి చంపారు. ఇంకా ఎంతమందిని పొట్టబెట్టుకుంటారు? ముస్లిం సోదరుల విషయంలో వైసిపి పేటిఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. మైనార్టీలను కంటికిరెప్పలా తెలుగు దేశం పార్టీ కాపాడు కుంటది అని చిలుముల దుర్గారావు పేర్కొన్నారు..
Comment List