జరగబోయే భారత రాజ్యాంగ హక్కుల పథకాలు నాయకత్వ లక్షణాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు
ఐ ఎన్ బి టైమ్స్ రయపొల్ మార్చి 26: అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు,సంక్షేమం పథకాలు నాయకత్వ లక్షణాల పై దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు కోరాడు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ మంగళవారం నాడు రాయపోల్ మండల్ అనాజిపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలతో కలిసి నేడు జరగబోయే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం భారత రాజ్యాంగ హక్కులు చట్టాలు సంక్షేమ పథకాల నాయకత్వ లక్షణాలపై బుధవారం నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు కు వచ్చి ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఎం ఎంఎస్, యాప్ ను ఆధార్ కార్డు లింక్ ను ఉపసంహరించుకోవాలని పాత విధానాన్ని కొనసాగించాలని,అలాగే మూడు నెలల నుండి ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీలకు ఇంతవరకు కూలీల ఖాతాలో రని నయా పైస అని అన్నాడు, నేడు జరగబోయే ఈ సదస్సుకు ఉపాధి హామీ కూలీలు అత్యధికంగా వచ్చి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాలని కోరాడు,సదస్సుకు మహిళా నాయకురాలు శ్రామిక కూలీలు పెద్ద సంఖ్యలో వచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరాడు.
ఈ కార్యక్రమంలో అనాజిపూర్ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Comment List