వినూత్న కథా చిత్రం దెయ్యం చెప్పిన సాక్ష్యం*
ఎన్ బి టైమ్స్ విశాఖ సిటీ మార్చి 28 :ఎం ఎం ఎం క్రియేషన్స్
హైదరాబాద్ బేనర్ పై తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, బొజ్ పూరి భాషల్లో నిర్మితమౌతున్న దెయ్యం చెప్పిన సాక్ష్యం సినిమా యొక్క వివరాలు తెలియజేసేందుకు గురువారం డాబాగార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది.
వినూత్న కథతో తీసిన సినిమా దెయ్యం చెప్పిన సాక్ష్యం అని
హీరో,
చిత్ర దర్శకుడు ప్రవీణ్ చక్రవర్తి పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంచి కి చెడుకి వున్న తేడా, రెండు కాలాల మధ్య జరిగిన కథాంశం తో సినిమా తీస్తున్నను అన్నారు. ఇది సంగీత ప్రధాన సినిమా. తాను పలు సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను అని గుర్తు చేశారు. తెలుగు తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తాను మమ్ముట్టి, ప్రభుదేవా, అర్జున్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుత తెలుగు
సినిమాలు కొత్త కోణంలో వెళుతున్నాయి. నమ్మకానికి పవిత్ర ప్రేమకు మద్య జరిగిన కదే ఈ సినిమా. ఉత్తర భారత్ లో జరిగిన కథ తో తీసే ఈ సినిమా లో ఇద్దరు కొత్త హీరోయిన్లు వున్నారు. దెయ్యం కోర్టులో చెప్పే సాక్ష్యం చుట్టు వినోద బరితంగా సాగే కథ అని వివరించారు. తాను గతంలో కో - డైరెక్టర్ గా పని చేశాను అని గుర్తు చేశారు.
నిర్మాత జగపతి రాజు మాట్లాడుతూ, మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి అని కోరారు. తనకు సినిమాలతో యాబై ఏళ్లుగా అనుబంధం వుంది. సిమ్లా, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది అని తెలిపారు.
నిర్మాత
పీ ఎన్ తిలక్ మాట్లాడుతూ, ప్రవీణ్ విశాఖ నుంచి చెన్నై వెళ్ళారు అని గుర్తు చేశారు. తాను నిర్మించిన నా చెలియా సినిమా కి ప్రవీణ్ సహకారం అందించారు అని గుర్తు చేశారు.
Comment List