సిద్దిపేట లో శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహించిన కోటి తలంబ్రాల దీక్ష అద్భుతం
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 24: సిద్దిపేట లోని మార్కండేయ స్వామి దేవాలయంలో ఆదివారం నాడు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు నిర్వహించిన గోటి తలంబ్రాల కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రామనామాన్ని స్మరణ చేస్తూ గోటితో ఓడ్లను ఒలిచి తమ భక్తిని చాటుకున్నారు. మా సిద్దిపేట గ్రామానికి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు గారు గోటి తలంబ్రాలు తీసుకొచ్చి మమ్మల్ని కూడా శ్రీరాముని కల్యాణ తలంబ్రాల్లో పాలు పంచుకునే మహా భాగ్యాన్ని కల్గించినందుకు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యకులు కాముని రాజేష్ పాల్గొని రామకోటి రామరాజును ఘనంగా సన్మానించి అనంతరం మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని గోటి తలంబ్రాల్లో బాగా స్వాములను చేయడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా భాద్యులు బైరి మురళి, నరేష్ చారి, అయిత శ్రీకాంత్, సురేష్, దేవేందర్, మహేష్, లక్ష్మణ్, నగేష్ జీ, సురేందర్ తదితరులు ప్పాల్గొన్నారు..
Comment List