ఓటు హక్కును ఉపయోగించుకోవాలి
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలి
ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, మార్చి 26: రామగుండం పోలీస్ కమిషనర్, ఎం శ్రీనివాసులు ఐ జి,ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల జిల్లా డిసిపి అశోక్ ఐపీఎస్,ఆదేశాల అనుసారం బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో,రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవరం సాయంత్రం రాబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా రామకృష్ణాపూర్ పట్టణంలో పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పోలీసు వారి నియమ నిబంధన సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు, తమ ఓటు హక్కు ను వినియోగించుకుని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సర్కిల్ ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్ లతో , పాటు 100 మంది కేంద్ర బలగాలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List