సింగరేణి ఎమ్ డి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ ఎన్ టి యు సి నాయకులు
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మార్చి 28 హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సింగరేణి సి అండ్ ఎం డి బలరాం నాయక్ . ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ నాయకులు అన్ని ఏరియా ల వైస్ ప్రెసిడెంట్లు పాల్గొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న పలు రకాల సమస్యలను వారి దృష్టి కి తీసుకెళ్లారు , ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్ కమ్ టాక్స్ రద్దు , సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వంటి వాటిపై దృష్టి సారించాలని కోరారు . అంతే కాకుండా కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేసి సింగరేణి వ్యాప్తంగా నూతన ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. వీటికి వారు సానుకూలంగా స్పందించి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక ఉత్పత్తి సాడించినదుకు గాను హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైజ్ ప్రెసిడెంట్ సిద్ధం సెట్టి రాజమౌళి , సంగం ప్రకాష్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ ..రామారావు. సొగల శ్రీనివాస్. కాగితపు శ్రీనివాస్. గోదాల వినాయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comment List