గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిని కలిసిన-నీలం మధు ముదిరాజ్
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 27: మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గజ్వేల్ నియోజికవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి లను కలిశారు. ఎంపీ అభ్యర్థిగా తన ఎంపికలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకి సంపూర్ణ ఆశీస్సులు కావాలనీ కోరారు.వచ్చే ఎన్నికల్లో మీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రచారంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం నర్సిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో వారి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్ పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
27 Apr 2024 12:07:47
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
Comment List