గజ్వేల్ మున్సిపల్ కార్మికునికి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన చెలిమి ఫౌండేషన్
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 28: చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 62 వ కార్యక్రమం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజ్ఞాపూర్ 4 వ వార్డుకు చెందిన సల్ల స్వామి అనే అతను ఇటీవలే గుండె సంబంధ వ్యాధితో చనిపోగా ఇతనికి ఎలాంటి ఆస్తులు లేవు అని భార్య కవిత పిల్లలు రేవంత్ యశ్వoతు లు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి చూసి మన ఫౌండేషన్ దృష్టికి నాగపురి రమేష్,టెంట్ నర్సింలు తెలుపగా వారికి మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడువేల ఐదువందల రూపాయలు నిత్యావసర సరుకులను,పదకొండు వేల ఐదు వందల నగదును మొత్తంగా పదిహేను వేల రూపాయలు అందచేయటం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు గుర్రం తులసీదాస్,కోశాధికారి దొంతుల ఆనంద్,సభ్యులు గుంటకు శ్రీనివాస్, పిట్ల ఆంజనేయులు, నాగపురి రమేష్,టెంట్ నర్సింలు, పెదూరి శ్రీనివాస్,యాట ఆంజనేయులు, మంగళం పల్లి సత్యనారాయణ,జాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Comment List