ప్రబలంగా సైలెంట్ వేవ్.. ఖమ్మం విజేత తాండ్ర వినోద్ రావు...

బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రబలంగా సైలెంట్ వేవ్.. ఖమ్మం విజేత తాండ్ర వినోద్ రావు...

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 29: ఖమ్మం లో, కేంద్రం లో మళ్లీ బిజెపిని అధికారమని, మరోసారి మోడీ రావడం ఖాయమని తమిళనాడు కర్ణాటక సహా ఇన్చార్జి  పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద రావు  అన్నారు. శుక్రవారం ఖమ్మం లో బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మేము ఎంతమంచి చేయాలన్న ప్రజల వరకు తీసుకుని వెళ్ళాలి అంటే మీడియా సహకారం కావాలన్నారు. నిన్నటి నుండి ప్రచారం ప్రారంభించాం, ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని,ఈ ఎన్నికల్లో బీజేపీ కి సుమారు 420 పై గా సీట్లు గెలుపొందుతున్నాం, అందులో ఖమ్మం సీటు కూడా ఉంటుందన్నారు.జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని,
రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు.నరేంద్ర మోడీనీ మూడవసారి గెలిపించేందుకు వారి వంతు ప్రచారం చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని,ఈ నంబర్ 9505439505 కు మేసేజ్ చేస్తే వారిని నరేంద్ర మోడీ సైన్యంలో కలుపుకుంటామన్నారు.పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎక్కువగా ప్రయాణం చేసే రాజకీయ నాయకులుఖమ్మం బీజేపీ అభ్యర్థిగా వినోద్ రావుకు రాష్ట్ర, కేంద్ర నాయకులు ఆశీర్వాదంతో సీటు పొందిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఒక సైలెంట్ వేవ్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ నడుస్తుంది.తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వ్యక్తి వినోద్ రావుదేశ హితంగా, సమాజ హితంగా పని చేసే వ్యక్తి వినోద్ రావుదేశం, ధర్మం కోసం పని చేసే పార్టీ బీజేపీ పార్టీ విదేశాల్లో కూడా భారత దేశ కీతిని ప్రభలేలా చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ.యావత్ భారత దేశంలోనీ ప్రతి ఇంటికి చేరిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు.అచ్చంగా బీజేపీ పార్టీ 370 సీట్లలో, ఎన్డీఏ తో కలిపి 400 పైగా స్థానాలతో మూడవసారి అధికారంలోకి బీజేపీ రావడం ఖాయంవిపక్ష పార్టీలు ఇండి కూటమి వారు స్కాం లు చేస్తూ జైల్ లకు వెళ్తున్నారురైతులకు, మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఏకైక నాయకత్వం బీజేపీ నాయకత్వం తమిళనాడు లో మూడు ఏళ్ల క్రితం గో బాక్ మోడీ అన్నవాల్లు ఇప్పుడు వాంగ (రండి) మోడీ అని స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభ వేదికగా బీజేపి కి 400 సీట్లు వస్తాయని చెప్పారు.రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్టార్ క్యాంపెనేయిర్ గా పని చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన అరు గ్యారెంటిలు ఎప్పుడు అమలు చేయాలి, అదే మోడీ గ్యారెంటీలు అయితే నిజమైన గ్యరెంటిలు.అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలంగాణ కు ఏడు లక్షల కోట్ల నిధులు మంజూరు చేశాం, 5 వ ఎకానమీ గా ఉన్న భారత దేశం 3 వ ఎకానమీ గా ఎదగాలంటే బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలి
నరేంద్ర మోడీకి బహుమతిగా ఖమ్మం సీటు కూడా గెలిపించి ఇవ్వాలి. సేవ చేస్తున్న, చేయాలి అనుకునే వ్యక్తి తాండ్ర వినోద్ రావు ఆయనను గెలిపించి మరింత సేవ చేసేందుకు సహకరించండి
వినోద్ రావు ను గెలిపించి ఖమ్మం అభివృద్ధికి కృషి చేయండి. బీఆర్ఎస్ కు ఓట్ వేసిన వృథానే, కాంగ్రెస్ కు ఓట్ వేసినా వృధానే బీజేపీకి ఓట్ వేసి ధర్మాన్ని గెలిపించండి టీడీపీ, జనసెన పార్టీలు ఎన్డీఏ లో చేరి ఆంధ్రాలో కలిసి పని చేస్తున్నారు, తెలంగాణలో కూడా కలిసి పని చేసి బీజేపీనీ గెలిపిద్దాం అందరం కలిసి పని చేసి బీజేపీ ఎంపీ అభ్యర్థినీ గెలిపిద్ధాం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ, రంగా కిరణ్, దొంగల సత్యనారాయణ, దుద్దుకూరి, వెంకటేశ్వర్లు, నున్న  రవి, చావా కిరణ్, రీజన్ ఏలూరు నాగేశ్వరరావు, విజయరాజు ,సుదర్శన్ గౌడ్, శ్యామ్ రాథోడ్, నున్న రవి, దార్ల శంకర్, అల్లిక అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 18

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News