*31వ వార్డు నుండి 100మంది టీడీపీ, జన సైనికులు చేరికలు*
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసుపల్లి !
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 : ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఆసీలమెట్ట పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 31వార్డు మండల ప్రెసిడెంట్ రామనంద్, బాపు ఆనంద్ అధ్వర్యంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 100మంది యువకులు వైసీపీ చేరారు. గొల్లలపాలెం పలపాల విజయ్ టీమ్, కనకల వీధి పండు టీమ్ యువకులుకి కండువా కప్పి పార్టీ లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం ఎక్కువమంది యువకులతో మరింత బలోపేతం అవుతుందని, భారీ ఎత్తున టిడిపి జనసేన నుండి వైసీపీలో చేరుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, దక్షిణలో తాను చేస్తున్న సేవలు నచ్చి పార్టీలో చేరారన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటిగా దక్షిణ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో వైసిపి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి జనసేన కుళ్ళు రాజకీయాల పట్ల యువత ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారని, మరింత మంది వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 31 వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List