బాండ్ల నగదు చెల్లింపులో జాప్యమెందుకు.....?
ఆర్టిసి కార్మికుల మనో భావాలతో ఆటాడుతున్న యాజమాన్యం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అప్పారావు
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 28: ఆర్టిసి యాజమాన్యం కార్మికుల పట్ల వివక్షా పూరిత ధోరణి అవలంభిస్తుందని బాండ్లకు సంబంధించిన నగదు చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతుందని ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల చెల్లింపుకు సంబంధించి రూ. 281 కోట్లను విడుదల చేసి 40 రోజులు గడుస్తున్నా కార్మికులకు నగదు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ అత్యవసర సమావేశం గురువారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. రీజియన్ కార్యదర్శి పిల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాటి అప్పారావు మాట్లాడుతూ బాండ్ల చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఆర్టిసి యాజమాన్య వైఖరి ఉందని కొంత భాగాన్ని సీనియార్టి ప్రకారం చెల్లిస్తామని చెప్పినా ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. ఎందుకు చెల్లించడం లేదో యాజమాన్యం కార్మికులకు తెలియజేప్పాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కార్మికుల మనోభావాలతో యాజమాన్యం ఆటలాడుతుందని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అప్పారావు పిలుపునిచ్చారు. యాజమాన్యం స్పందించక పోతే ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు. తొలిదశలో డిపో మేనేజర్లకు వినతి పత్రాలు అందజేస్తామని అప్పటికి యాజమాన్య వైఖరిలో మార్పు రాకపోతే ఆందోళన చెపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో అధ్యక్ష, కార్యదర్శులు డి. జగన్నాథం, వి. బుచ్చిబాబు, ఖమ్మం రీజియన్ పరిధిలోని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు గోపాలరావు, నాగులమీరా, రఘురాం, రాంబాబు, ఆర్. నాగేంద్రసింగ్, కె. నాగభూషణరావు, రాయప్ప, సుందరం, రమణారావు, మధు, పవన్, లాజర్, హరినాథ్ బాబు, రమాదేవి, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comment List